ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ పొజిషన్ వచ్చేవరకు చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే చాలు హీరో, హీరోయిన్స్ మధ్య పలు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది పెళ్లి వరకు తీసుకొని వెళ్లగా మరికొంతమంది లవ్ కి బ్రేకప్ చెప్పి మళ్ళీ వేరే వాళ్ళని వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాంటి జంటలలో ప్రభుదేవా ,నయనతార కూడా ఒకరు. వీరిద్దరి ప్రేమాయణం గురించి కోలీవుడ్ మీడియాలో టాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయి.
నయనతార తో ప్రభుదేవా వివాహం చేసుకోవడం కోసం ఏకంగా తాను ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకే విడాకులు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా నయనతార ,ప్రభుదేవా మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరూ బ్రేకప్ జరగడానికి ఇదే కారణం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నయనతార, ప్రభుదేవా అని వివాహం చేసుకోవడానికి సిద్ధమైన సమయంలో ప్రభుదేవా మొదటి భార్య విడాకులు ఇచ్చి తన ఇద్దరు కొడుకులను తనతో తీసుకురావడం జరిగింది.
కానీ కొడుకుల విషయంలో నయనతార ప్రతిసారి చాలా గొడవ పడుతూ ఉంటూ తన కొడుకులను దూరం పెట్టడం జరిగిందట.. దీంతో విసిగిపోయిన ప్రభుదేవా చివరికి నయనతారత బ్రేకప్ చెప్పారట. నయనతార, ప్రభుదేవా మధ్య బ్రేకప్ రావడానికి ప్రభుదేవా కొడుకులు కారణమని సమాచారం. ఇక తర్వాత నయనతార ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.