తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు. ఒకప్పుడు వారి టాలెంట్ లతో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ లో సుధాకర్ కూడ ఒకరు.తెలుగులో వందలాది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కమెడియన్ సుధాకర్. ఇప్పుడు కూడా ఈయన ప్రేక్షకులను నవ్వించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏజ్ తనకు సహకరించలేదని తెలుస్తోంది.
ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున జగపతిబాబు, ఇలా చాలామంది హీరోల చిత్రాలలో నటించారు.. అయితే ఒక్క తెలుగులోనే కాదు హిందీ, కన్నడ ,మలయాళం , భాషలలో కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఒక కమెడియన్ గానే కాకుండా నిర్మాతగా మారి తన సత్తా చాటుకున్నాడు. దాదాపు 45 ఏళ్ల పాటు ఇండస్ట్రీలోనే కొనసాగాడు సుధాకర్.. హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు.
అయితే ఇప్పుడు ఆయన అనారోగ్యం కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆయన కనపడకపోవడంతో సుధాకర్ చనిపోయాడని వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్త విన్న ఆయన ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది.. నేను బ్రతికే ఉన్నాను అని చెప్పటంతో అభిమానులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.
ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా బుల్లితెరపై సందడి చేశాడు.. ఆయన ఊత పదంతో కడుపుబ్బ నవ్వించాలని ప్రయత్నం చేశాడు. అయితే బుల్లితెరపై ఫాదర్స్ డే సందర్భంగా ఓ ఛానల్ నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఇప్పుడు ఆయనకి 64 ఏళ్లు అయినా యాంకర్ల సహాయంతో స్టేజ్ మీదకు వచ్చి ఓపిక లేకపోయినా ఆయన తరచుగా వాడే పదంతో తన ట్రెడ్ మార్క్ డైలాగులను చెప్పి అందరినీ నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు.
అంతే కాకుండా అదే సమయంలో తన కొడుకు ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించేసరికి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన వారందరూ సుధాకర్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు.. సుధాకర్ ని మాత్రం అభిమానులు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.