అక్కినేని మన్మథుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆల్రెడీ నాగార్జున గ్యారేజ్ లో రూ. 1.50 కోట్లు ఖరీదు చేసే బిఎమ్డబ్ల్యూ 7- సిరీస్, రూ. 2 కోట్లు విలువైన బిఎమ్డబ్ల్యూ ఎమ్6, ఆడి ఏ7, రేంజ్రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్జి, పోర్షే క్యాయేన్ ఇలా ఎన్నో లగ్జరీ కార్లు సేద తీరుతున్నాయి.
ఇప్పుడు ఈ జాబితాలో కియా ఈవీ 6 కారు వచ్చి చేరింది. ఇదొక ఎలక్ట్రిక్ కారు. ఈ కారులో డ్రైవర్ సీటును పది రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 77.4 కిలో వాట్స్ ఛార్జ్ చేస్తే 528 కి.మీ. వరకు ఈ కారులో ప్రయాణం చేయవచ్చు. కేవలం నాలుగున్నర నిమిషాలు ఛార్జ్ చేస్తే వంద కి.మీ. ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే ఈ కారులో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇంతకీ ఆ కారు ధరెంతో తెలుసా.. రూ. 60 నుంచి 70 లక్షల వరకు ఉంటుంది. ఇది నాగార్జున రేంజ్ కాకపోయినా.. కియా ఈవీ 6 కారు ఫీచర్స్ ఆయన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయట. అందుకే వెంటనే ఆ కారుకు తన గ్యారేజ్ లోకి వెల్కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. గత ఏడది ది ఘోస్ట్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న నాగార్జున.. ఆ తర్వాత మరొక ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. ఈయన నెక్స్ట్ మూవీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.