గుండుతో షాకిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌.. ఇంత‌కీ ఆమె ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

పైన ఫోటోలో గుండుతో షాకిచ్చిన హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఆమె సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా కూడా చేసింది. ఇంత‌కీ ఈ సినిమా మ‌రేదో కాదు `ట‌క్క‌రి దొంగ‌`. జయంత్ సి పరాంజి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన‌ ఈ చిత్రంలో మ‌హేష్ బాబుకు జోడీగా ఇద్ద‌రు బాలీవుడ్ హీరోయిన్లు న‌టించారు. అందులో బిపాషా బసు ఒక‌రు కాగా.. మ‌రొక‌రు లీసా రాయ్.

కౌబాయ్ నేపథ్యం ఉన్న సినిమా ఇది. మ‌హేష్ కెరీర్ లో భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన చిత్రాల్లో ట‌క్క‌రి దొంగ ఒక‌టి. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇక‌పోతే ఈ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన హీరోయిన్ లీసా రాయ్‌.. త‌నదైన అందం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది.

ట‌క్క‌రి దొంగ త‌ర్వాత తెలుగులో మ‌రొక సినిమా చేయ‌క‌పోయినా బాలీవుడ్ లో మాత్రం లీసా రాయ్ ప‌లు చిత్రాలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు టెలివిజన్ షోస్, వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే లీసా రాయ్‌.. తాజాగా గుండెలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆమె లుక్ చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కొంద‌రేమో ఆమె ట‌క్క‌రి దొంగ హీరోయిన్ లీసా రాయ్ అంటే గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఏదేమైనా లీసా రాయ్ గుండుతో ద‌ర్శ‌న‌మిచ్చి పెద్ద సాహ‌స‌మే చేసింది.