బాత్రూమ్‌ బ్రష్ ల‌ను కూడా వదలట్లేదు.. హీరోల‌పై కోటా షాకింగ్ సెటైర్లు!

విల‌క్ష‌ణ న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసిన కోటా శ్రీ‌నివాస‌రావు.. గ‌త కొంత కాలం నుంచి సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. వ‌య‌సు పై బ‌డ‌టం వ‌ల్ల సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న‌.. అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి ప్ర‌స్తావిస్తూ కోటా షాకింగ్ సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు వీళ్ళెవరూ తాము ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెప్పుకోలేదు. కానీ ఈమధ్య కొంతమంది రోజుకి రూ. 2 కోట్లు తీసుకుంటున్నాను, రూ. 3 కోట్లు తీసుకుంటున్నాను అని సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు` అంటూ కోటా తెలిపారు.

అలాగే వాణిజ్య ప్రకటనల గురించి కోటా మాట్లాడుతూ.. హీరోలు బాత్ రూమ్ బ్రష్ ల దగ్గర నుంచి బంగారం వరకు ఏవీ వదలడం లేదు. అన్ని ప్రకటనలు చేసేస్తున్నారు. హీరోలు ఆ స్థాయిలో సంపాదిస్తుంటే మిగిలిన నటులకు సంపాదన ఎలా ఉంటుంది అని కోట ప్ర‌శ్నించారు. ఇక కోటా కామెంట్స్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ను బాగా హ‌ర్ట్ చేశాయి. ఎందుకంటే, ఇటీవ‌ల ఓ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణే తాను రోజుకు రూ. 2 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాను అని బ‌హిరంగంగా వెల్ల‌డించారు. ఇప్పుడు కోటా ప‌వ‌న్ ను ఉద్దేశించే ప‌రోక్షంగా సెటైర్ వేయ‌డంతో..ఆయ‌న ఫ్యాన్స్ కోటాపై మండిప‌డుతున్నారు.