నాకు ప్రాణహాని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసిన కరాటే కళ్యాణి..!!

సినిమాలలో కంటే ఎప్పుడు వివాదాలలో పాపులారిటీ అవుతూ ఉంటుంది కరాటే కళ్యాణి.. ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించిన కరాటే కళ్యాణి ఈమధ్య కాలంలో సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తాజాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కరాటే కళ్యాణి ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నది.

Karate Kalyani Suspended From MAA Over NTR Statue Issue

సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా గత నెల 28వ తేదీన ఆవిష్కరించాల్సి ఉండగా కరాటే కళ్యాణి చేసిన ఇబ్బందుల వల్ల ఆ పని అనుకున్న విధంగా జరగలేదని చెప్పవచ్చు. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ పలు రకాల ఆరోపణలు చేస్తోంది.. తనను చంపేందుకు కొంతమంది ప్లాన్ చేస్తున్నారంటూ తెలిపింది. నా కార్లు టైర్లు గుర్తుతెలియని వ్యక్తులు కోసేసారని తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక కారు టైర్ పేలిందని తెలియజేసింది. ఖమ్మంలో రాజకీయం ఎక్కువగా జరుగుతుందని ఈ గొడవకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదని ఆమె అభిప్రాయాన్ని తెలియజేసింది.

సీనియర్ ఎన్టీఆర్కు దైవత్వాన్ని ఆపాదించాలని ఆలోచనలో కొంతమంది కృష్ణుని రూపంలో విగ్రహాలను పెట్టించారని ప్రయత్నాలు చేస్తున్నారని.. కృష్ణుడు రూపంలో మనుషుల విగ్రహాలు పెట్టడం సరికాదని అందుచేతనే ఈ విగ్రహాన్ని అడ్డుకోవడం జరిగిందని తెలిపింది. అయితే కరాటే కళ్యాణి పై సోషల్ మీడియాలో నెగటివ్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. అనవసర వివాదాలలో జోక్యం చేసుకోవడం ఆమె చేసిన అతిపెద్ద మైనస్ అన్నట్టుగా తెలుస్తోంది. మరి కరాటే కళ్యాణి ఇకనైనా ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటుందేమో చూడాలి మరి.