సుశాంత్ ఆత్మహత్యపై సంచలన పోస్ట్ చేసిన కంగానా రనౌత్..!!

టాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య పైన ఇప్పటికీ పలు రకాల విషయాలు చర్చలు జరుగుతూనే ఉంటాయి. తనది సూసైడ్ కాదని ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద వ్యక్తులు చేసిన పని వల్ల సుశాంత్ మరణించాడు అంటూ పలువురు మాట్లాడుతూ ఉంటారు.

Everybody ganged up to corner Sushant Singh Rajput, reveals Kangana Ranaut

ఇలా మాట్లాడే వారిలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత కూడా ఒకరు.. ఇప్పటికీ ఎన్నోసార్లు సుశాంత్ మరణం పైన హాట్ కామెంట్లను సైతం చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి ఒక సంచలన పోస్ట్ చేసింది. తన ఇంస్టాగ్రామ్ లో కంగనా రనౌత్ ఇలా రాసుకోస్తూ సినీ ఇండస్ట్రీలో రకరకాల బెదిరింపులు ఉంటాయి కానీ ఒక దుర్యోధనుడు..(తెల్ల ఎలుక) శకుని…(పాప జో) చేసే వేధింపులు మరింత దారుణంగా ఉంటాయి ఈ ఇద్దరు వాళ్లకి వాళ్లు సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీల్ అవుతూ ఉంటారని తెలుపుతోంది.

ఇండస్ట్రీలో వచ్చే ఫేక్ న్యూస్ అన్నిటికి కూడా కారణం వీరిద్దరే..అన్ని పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసు అలా చేసే సుశాంత్ సింగ్ ని ఆత్మహత్య చేసుకునేలా చేశారని తెలుపుకొచ్చింది.. సుశాంత్ మరణానికి ప్రధాన నిందితులు కూడా వారానంటే రాసుకొచ్చింది కంగనా రనౌత్.. అలాగే తనపై కూడా ఎన్నో అసభ్యకరమైన వార్తలు సృష్టించారు.. హృతిక్ రోషన్ తో వివాదంపై ఎంతో దుష్ప్రచారం చేశారు తన జీవితంలో వారు వేధింపులు శృతిమించిపోయాయని తెలుపుకొచ్చింది. కానీ వీరిద్దరి పేర్లు చెప్పకుండా దుర్యోధనుడు శకుని పేర్లు మాత్రమే చెప్పుకొచ్చింది.. వినిపిస్తున్న సమాచారం రణబీర్, కరన్ను ఉద్దేశించే ఈమె పోస్ట్ చేసినట్లు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.