అతడు చేసిన పని వల్లే రష్మిక పెళ్లికి దూరమైందా..!!

కన్నడ సినీ పరిశ్రమ నుంచి మొదట కిరీక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక. ఇందులో హీరోగా రక్షిత్ శెట్టి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా..వీరిద్దరూ 2017 వ సంవత్సరంలో ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో సినీ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కావాల్సి ఉన్న ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

Rashmika Mandanna breaks off engagement with Rakshit Shetty: Reports
టాలీవుడ్ లోకి మాత్రం మొదట ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత గీత గోవిందం , సరిలేరు నీకెవ్వరు,తదితర చిత్రాలలో నటించి ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది రష్మిక. ప్రస్తుతం తెలుగు తమిళ్ హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే రష్మిక కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయినప్పటికీ తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి తో బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు.

Venu Swamy shocking confessions | cinejosh.com
కానీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఒక వ్యక్తి కారణంగా వీరిద్దరు విడిపోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. రష్మిక , రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరి జాతకాలను చూసి పెళ్లి చేసుకుంటే దూరం అవుతారని విషయాన్ని తెలియజేశారట. దీంతో పాటు ఈమె కెరియర్ కూడా నాశనమవుతుందని చెప్పడంతో తన కెరీర్ కోసమే తన ప్రియుడిని వదులుకున్నట్లు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వేణు స్వామి చేసిన పని వల్లే రష్మిక, రక్షిత శెట్టి విడిపోయారని పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.