టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే మును పెన్నాడు లేనివిధంగా సరికొత్త రికార్డులను సైతం సృష్టించడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా విడుదల కాకముందే ఇప్పుడు సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి చాలా ఆకరి చేతులు అవుతున్నారు.
అనాధ పిల్లల కోసం వృద్ధాశ్రమాల కోసం దాదాపుగా 10,000 టికెట్లను తెలంగాణ వ్యాప్తంగా పంచుతామంటూ ఇప్పటికే పలువురు నిర్మాతలు సహితం అధికారికంగా ప్రకటించారు. దీంతో అందరూ కూడా ప్రశంసించడం జరుగుతోంది. ఇప్పుడు ప్రొడక్షన్ టీమ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతు తమ వంతు పాత్ర పోషించడానికి ప్రభాస్ కి అత్యంత సన్నిహితులైన కొంతమంది స్టార్ హీరోలు కూడా ముందుకు రావడం జరిగింది. బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన రణబీర్ కపూర్ ప్రభాస్ కి బాలీవుడ్లో అత్యంత సన్నిహితుడు..
తన వంతు సహాయంగా 10,000 టికెట్స్ అనాధ పిల్లల కోసం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్ ప్రభాస్ కి కూడా మంచి మిత్రుడు ఈయన కూడా పదివేల టికెట్స్ తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మరొక నటుడు గోపీచంద్, అనుష్క, అల్లు అర్జున్ కూడా 10,000 టికెట్ల చొప్పున అనాధ పిల్లల కోసం ఉచితంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇండియాలో ప్రభాస్ కి మిత్రులైన కొంతమంది పదివేల టికెట్లు చొప్పున ఫ్రీగా టికెట్లు తీసుకొని ఉంచినట్లుగా తెలుస్తోంది. దీంతో విడుదలకు ముందే దాదాపుగా లక్ష టికెట్లు అనాధ పిల్లల కోసం తీసుకున్న ఏకైక చిత్రంగా ఆదిపూరు సినిమా నిలిచిందని చెప్పవచ్చు. ఈ చిత్రం ఈనెల 16వ తేదీన విడుదల కాబోతోంది. మరి తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.