షూటింగ్ లో గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్.. ఆందోళనలో అభిమానులు..!!

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అటు తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తాజాగా ది కానిస్టేబుల్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ గాయపడినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వరుణ్ సందేశ్ గత కొద్ది రోజులుగా ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా షూటింగ్లో వరుణ్ కాలుకు బలమైన గాయమైనట్లుగా చిత్ర బృందం తెలియజేసింది .వెంటనే హుటాహుటిగా అక్కడ ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని పరీక్షించిన తర్వాత వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు వరుణ్ సందేశ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

వరుణ్ సందేశ్ తన కెరియర్లో స్టోరీల పరంగా కథలను సరిగ్గా ఎంచుకోలేకపోవడంతో డిజాస్టర్ లను మూట కట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజులకె హీరోయిన్ వేదిక షేర్ ను వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవలే బిగ్ బాస్ రియాల్టీ షో తో మరొకసారి ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. సందీప్ కిషన్ నటించిన మైకేల్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు వరుణ్ సందేశ్. మరిది కానిస్టేబుల్ సినిమాతో నైనా ఈసారి సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.