మళ్లీ ఎన్టీఆర్ -బాలయ్య మధ్య గొడవలు మొదలయ్యాయా..?

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నిన్నటి రోజున కావడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా బాలయ్యను విష్ చేయడం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.కళ్యాణ్ రామ్ కూడా విష్ చేయడంతో పాటు భగవంత్ కేసరి టీజర్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ.. మధ్య జూనియర్ ఎన్టీఆర్ ,బాలయ్య కి మాత్రం అసలు విషెస్ చెప్పలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ పైన కాస్త కోపంగా ఉన్నట్లు సమాచారం.

Balakrishna, Jr NTR not approached for Kangana Ranaut's Thalaivi: report -  Hindustan Times
జూనియర్ ఎన్టీఆర్ చివరిగా 2020లో బాలయ్య బర్తడే సందర్భంగా విషెస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండేళ్లు కూడా చెప్పలేదు. మరల ఇప్పుడు విషెస్ చెప్పడం అవాయిడ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై నందమూరి అభిమానులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు.. గత కొన్నేళ్లుగా నందమూరి కుటుంబం మధ్య దూరం పెరిగిందని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఒకవైపు మిగిలిన నందమూరి ఫ్యామిలీ అంతా మరొకవైపు ఉన్నది.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి తారక్ ని ఆహ్వానించిన రారని వారు చెప్పడం జరిగిందట. ఎన్టీఆర్ జయంతి రోజున నివాళి అర్పించేందుకు కేవలం ఘాట్ వద్దకు మాత్రమే వెళ్లడం జరిగింది. ఆ తర్వాత నందమూరి అభిమానులపై తారక్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు . గతంలో కూడా చంద్రబాబు సతీమణి పైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఎన్టీఆర్ సీరియస్ గా అసలు స్పందించలేదు. ఇప్పుడు బాలయ్య కు విషెస్ చెప్పకపోవడంతో ఎన్టీఆర్, బాలయ్య మధ్య ఏదో విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు నెటిజెన్లు సైతం ఎన్టీఆర్ పైన ట్రోల్ చేయడం జరుగుతోంది.