నటుడు జే.డీ.చక్రవర్తి పై విష ప్రయోగం చేసింది ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు జేడీ చక్రవర్తి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరో గానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు చిత్రాలలో నటించారు. ఇప్పటికీ పలు చిత్రాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తే బిజీగా ఉన్నారు జెడి చక్రవర్తి. జె.డి చక్రవర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తనపైన ఒక వ్యక్తి ఏకంగా ఎనిమిది నెలల పాటు విష ప్రయోగం చేశారని విషయాన్ని తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

జెడి చక్రవర్తి మాట్లాడుతూ కషాయం రూపంలో అతడు తనకి విషయాన్ని ఇచ్చారని అతడు ఇచ్చిన విషం కారణంగానే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం తనకు ఊపిరి తీసుకోవడం కూడా చాలా సమస్యగా మారిపోయిందని ఆ సమస్యకు ఇండియాలో ఎక్కడా కూడా పరిష్కారం దక్కలేదని దీంతో విదేశాలకు సైతం వెళ్లానని అక్కడ కూడా అంత బాగానే ఉంది సమస్యకు కారణం ఏంటనే విషయం తెలుసుకోలేకపోతున్నామంటూ వైద్యులు తెలియజేశారని తెలిపారు.

ఆ సమయంలోనే తన స్నేహితుడు శేషురెడ్డి తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. డా. నాగార్జున వద్దకు వెళ్లి ఆయన తనను పరిశీలించి డ్రగ్స్ తీసుకుంటున్న కారణంగానే ఇలా జరిగిందని తెలిపారుట. దీంతో ఆ విషయం విని ఒక్కసారిగా షాక్ అయ్యానని తనకు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎలాంటి అలవాటు లేదు ఈ విషయం విన్న తర్వాత డాక్టర్ కూడా షాక్ అయ్యారని తెలిపారు. అయితే కొన్నేళ్ల క్రితం తాను కషాయం తాగేవాడినని .. ఆకషాయాన్ని ఒకరోజు నిర్మాత ఖాసిం కు ఇచ్చాను ఆయన వెంటనే తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడ్డారు వాంతులు కూడా అయ్యాయని తెలిపారు. ఆ కషాయం తాగిన వెంటనే మందు తాగే వారికి వాంతులు జ్వరం కూడా వస్తుందట .జె.డి చక్రవర్తికి ఎలాంటి అలవాటు లేదు కనుక తన మీద ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. ఆకషాయాన్ని ఇచ్చే వ్యక్తి వేరే వారికి ఎందుకు ఇచ్చావు అంటూ జెడి చక్రవర్తితో గొడవ పడ్డారట. అప్పుడే అర్థమైందట తనకి తనమీద ఎనిమిది నెలలుగా విష ప్రయోగం జరుగుతూనే ఉందని తెలిపారు.ఈ కషాయాన్ని తన భార్య రోజు ఇచ్చేదట.