ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

ఆది పురుష్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఇదే మేనియా నడుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే జూన్ 6వ తేదీన మంగళవారం తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ముఖ్యంగా ఈ వేడుకకు లక్షకు పైగానే అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చిన్న జీయర్ స్వామీజీ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేశారు అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 16వ తేదీన అంటే వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,పోస్టర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు రూ. 50 లక్షల విలువైన క్రాకర్స్ ఏర్పాటు చేశారట. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో అయోధ్య సెట్ ఏర్పాటు చేశారని.. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులను కూడా ఆయనే దగ్గరుండి మరీ చూసుకున్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోసం దాదాపు 7 నెలలుగా ఎవరు నిద్రపోలేదు అని ఓం రౌత్ లాంటి కష్టపడే దర్శకుడుని తన 20 ఏళ్ల సినీ కెరియర్ లో ఎప్పుడూ చూడలేదు అని ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రభాస్.