టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే.. అందులో బోయపాటి శ్రీను పేరు ఖచ్చితంగా ఉంటుంది. భద్ర మూవీతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన బోయపాటి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు ఇలా బ్యాక్ టు బ్యాక్ విషయాలను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు.
ఆ మధ్య అఖండ మూవీతో మరో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను.. ప్రస్తుతం రామ్ పోతినేనితో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. బోయపాటి వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో ఆయన జన్మించారు. బోయపాటి విలేఖ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.
ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒక కూతురు. అయితే బోయపాటి కూతురు జోషిత మీ అందరికీ బాగా తెలుసు. నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా కూడా చేసింది. అవును, మీరు విన్నది నిజమే. బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కిన రెండో చిత్రం `లెజెండ్`. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య తన చెల్లెలిని చూడటానికి వెళ్లిన సీన్ థియేటర్స్ లో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఆడపిల్లల గురించి ఆ సన్నివేశంలో బాలయ్య చెప్పే డైలాగ్స్ ఫిదా కాని వారుండరు. అయితే ఆ సన్నివేశంలో బాలయ్యను `మామయ్యా..` అంటూ ముద్దుగా పిలిచే చిన్నారి గుర్తుందా..? ఆమె ఎవరో కాదు బోయపాటి కూతురు జోషితనే. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం జోషిత చదువుకుంటోంది.