ఒకేసారి 8 మందితో చేస్తాడా.. చిరంజీవి మామూలోడు కాదు!?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుంటే.. సోద‌రి పాత్ర‌లో కీర్తి సురేష్ అల‌రించ‌బోతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టులో విడుద‌ల కాబోతోంది.

ఈ మూవీ అనంత‌రం గ‌తే ఏడాది ‘బింబిసారా’తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్‌ అందుకున్న వశిష్ఠతో ఓ సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. వశిష్ఠ చిరంజీవి కోసం సోషియో ఫాంటసీ నేపథ్యంలో కథ తయారు చేశాడ‌ట‌. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై హై బ‌డ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కాబోతోంద‌ని తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 8 మంది హీరోయిన్ల‌తో చిరంజీవి రొమాన్స్ చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం హీరోయిన్ల ఎంపిక‌లోనే డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ ఉన్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ నడుస్తోంది. స్టార్ హీరోయిన్ల‌తో పాటు కొత్త హీరోయిన్లు కూడా ఈ సినిమాలోకి తీసుకుంటున్నార‌ని అంటున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఒక హీరో ఎనిమిది మంది హీరోయిన్స్ తో కలిసి నటించడం అనేది జరగలేదు. ఈ అరుదైన ఘ‌న‌త‌ను ఇప్పుడు చిరంజీవి సొంతం చేసుకోబోతుండ‌టంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు.