మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటకు లాస్ట్ నైట్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. హైదరాబాద్ లో గత ఇరు కుటుంబ సభ్యుల నడుమ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడక ఘనంగా జరిగింది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో వీరిద్దరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. నిశ్చితార్థంలో లావణ్య త్రిపాఠి కట్టిన చిర ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
లైమ్-గ్రీన్ బనారసి చీరలో లావణ్య త్రిపాఠి మెరిసింది. మెడలో హెవీ చోకర్ మరియు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లో పెట్టుకుని అందరినీ ఎట్రాక్ట్ చేసింది. అయితే ఈ చీర ఖరీదు లక్షల్లో ఉంటుందని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, లావణ్య కట్టన చీర రూ. 75,000. మాత్రమే. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే ఈ చీరను డిజైన్ చేశారు. అయితే ఈ చీర ఖరీదు తెలిసి మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చీర అంత చీపా.. మెగా ఫ్యామిలీ పరువు పోగొట్టేసింది అంటూ అభిప్రాయపడుతున్నారు. పెళ్లికైనా కాస్త కాస్ట్లీ చీరలు కడితే బాగుతుందని లావణ్యకు సూచనలు చేస్తున్నారు.