పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన ట్రైలర్, రెండు సాంగ్స్ కు విశేషమైన ఆదరణ లభించింది. అలాగే ఈ చిత్రంపై భారీ అంచనాలు సైతం నెలకొన్నాయి. ఇక నిన్న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ సెకెండ్ ట్రైలర్ ను కూడా వదిలగా.. అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. రామ రావణ యుద్ధం ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది.
మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ మరింత అద్భుతంగా ఉంది. కానీ, ఇందులో ఒక్కటే పెద్ద మైనస్ గా కనిపిస్తోంది. అదే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్స్ చాలా నీరసంగా ఉన్నాయి. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రూ. 500 కోట్ల సినిమాలో ఇదెలా మర్చిపోయారు అంటూ చిత్ర టీమ్ కు చురకలు వేస్తున్నారు. మరి ఆదిపురుష్ థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఈ మైనస్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి.