బ్రోతల్ హౌజ్‌లో అనుష్క శెట్టి కష్టాలు.. వింటే కంట తడి పెట్టుకుంటారు!

హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటన, అందంతో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ అవ్వాలనే కోరిక అనుష్కకి చిన్నప్పటి నుండే ఉండేదట. కానీ అవకాశాలు లేకపోవడంతో ఒక సీరియల్‌లో కూడా నటించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ అనుష్క మొహం “మీద నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు” అని అన్నాడట. దాంతో సినిమాలను పక్కనపెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుందట అనుష్క. ఆ సమయంలోనే హీరోయిన్ భూమిక భర్త భరత్ ఠాగూర్, అనుష్కని పూరి జగన్నాథ్ కి పరిచయం చేసాడు.

అలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది అనుష్క. ఇక ఆ తరువాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తన టాలెంట్‌తో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. ఎటువంటి పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతుంది అనుష్క. అయితే అలాంటి స్టార్ హీరోయిన్ దర్శకుడు కృష్ దర్శకత్వం లో వచ్చిన వేదం సినిమా లో ఒక వేశ్య పాత్రలో నటించింది.

వేదం సినిమాలో ఒక పాట నేచురల్‌గా రావడం కోసం దర్శకుడు క్రిష్, అనుష్క ని ఏకంగా బ్రోతల్ హౌస్ కి తీసుకెళ్లి షూటింగ్ చేయించారట. అలా అనుష్క బ్రోతల్ హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మహిళలు చెప్పే కష్టాలను చూసి చలించిపోయి కంట నీరు పెట్టుకుందట అనుష్క. డబ్బు కోసం ఆడవాళ్లు ఇలాంటి కష్టాలు పడతారా, మరి ఇంత పాపం అని బాధపడుతూ షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లి పోయిందట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ బాధనుండి తేరుకొని బయటికి వచ్చి మళ్లీ షూటింగ్లో పాల్గొందట. ఈ విషయాన్ని స్వయంగా అనుష్కనే ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకుంది. ఇక ప్రస్తుతం అనుష్క, నవీన్ పోలిశెట్టికి జంటగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, సినిమాలో నటిస్తుంది.