బ్యాక్ టు బ్యాక్ అరడజన్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని కెరీర్ పరంగా యమా జోరు చూసిస్తున్న టాలెంటెడ్ హీరో అడివి శేష్ త్వరలోనే అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్నాడట. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ మెడలో శేష్ మూడు ముళ్లు వేయబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ నెలలోనే వీరి తేదీ లాక్ అయిందని అంటున్నారు.
సుప్రియకు ఇంతముందే వివాహం జరిగింది. `అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి` మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సుప్రియ.. `ఇష్టం` ఫేమ్ చరణ్ రెడ్డిని వివాహం చేసుకుంది. అయితే కొన్నాళ్లకే అతడితో విడిపోయింది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన `గూఢచారి` మూవీతో మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అడివి శేస్, సుప్రియ ప్రేమలో పడ్డారని.. ఇప్పుడు వీరి బంధం పెళ్లి వరకు వెళ్లబోతోందని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, జూన్ 16వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటు శేష్ కానీ అటు అక్కినేని ఫ్యామిలీ కానీ కన్ఫామ్ చేయలేదు. అలాగే ఇంత వరకు ఖండించనూ లేదు. మరి నిజంగానే ఈ నెలలో అడివి శేష్, సుప్రియ మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారా.. లేదా ఇది పుకారేనా అన్నది తెలియాల్సి ఉంది.