యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న లీలా ప్యాలెస్ లో రెండు రోజుల పాటు వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పెళ్లికి ముందు పలు కార్యక్రమాలను నిర్వహించారు. జూన్ 3వ తేదీ రాత్రి శర్వానంద్ రక్షిత రెడ్డితో ఏడడుగులు వేశాడు. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు వీరి వివాహారికి హాజరు అయ్యారు. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొట్టాయి.
ఇకపోతే శర్వానంద్ కోసం రక్షిత రెడ్డి ఎన్ని కోట్లు కట్నంగా తెచ్చిందో తెలిస్తే షాక్ అయిపోతారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు అయిన రక్షిత.. అత్తారింటికి మూడు కేజీల బంగారంతో పాటు ఇరవై కోట్లు విలువ చేసే ఆస్తులను కట్నంగా తెచ్చిందట. అలాగే శర్వానంద్ కు పెళ్లి కానుకగా రక్షిత తండ్రి ఓ లగ్జరీ హౌస్ ను ఇచ్చారట. శర్వానంద్, రక్షిత తమ కొత్త కాపురాన్ని ఆ ఇంట్లోనే ప్రారంభించనున్నారని అంటున్నారు.