ఆది పురుష్..ఇండియాలో అంతటి స్టామినా ప్రభాస్ కే సాధ్యం..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం నటించిన పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఈ రోజున భారీ అంచనాల మధ్య విడుదలై సక్సెస్ అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.చివరిగా ప్రభాస్ బాహుబలి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత తను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. బాహుబలి తర్వాత నటించిన చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ అయిన ఎక్కడ ఇమేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అదే జోష్తో అదే క్రేజీతో దూసుకుపోతున్నారు ప్రభాస్.

ప్రభాస్ గురించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతోంది ..అదేమిటంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు రూ .200 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన ఇండియన్ హీరోగా పేరుపొందారు.. గత పరాజయాలతో సంబంధం లేకుండా ఇలా బిజినెస్ జరిగింది.. అసలు విషయంలోకి వెళ్తే బాహుబలి రూ.320 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా స్థాయిలో క్రాస్ వసూలు సాధించింది. ఆ తర్వాత విడుదలైన సాహో సినిమా రూట్.270 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ సినిమా హిందీ మార్కెట్లో పర్వాలేదు అనిపించిన ప్రపంచవ్యాప్తంగా నష్టాలని మిగిల్చిందట.

ఇక తన తదుపరిచిత్రం ఎక్కడ తగ్గకుండా విడుదలైన చిత్రం రాధే శ్యామ్.. ఈ సినిమా కూడా రూ .200 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందట. ఈ సినిమా కూడా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది.. దీంతో ప్రభాస్ మార్కెట్ పడిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు సైతం తెలియజేశారు. దీంతో దేశీయ మార్కెట్ కూడా డౌన్ అయ్యిందని ట్రెండ్ వర్గాలు అంచనా వేయడం జరిగింది. కానీ తాజాగా ఆది పురుష్.. చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఏకంగా రూ.320 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ జరిగినట్లు సమాచారం. మొదట ఈ సినిమాపై నెగటివ్ వచ్చినప్పుడు ఈ సినిమా బిజినెస్ సాధ్యమేనా అంటూ విమర్శలు వినిపించాయి. కానీ వాటన్నిటిని తుడిచివేసింది ఆది పురుష్ చిత్రం.