టాలీవుడ్ లో నటుడు తనికెళ్ల భరణి గురించి చెప్పాల్సిన పనిలేదు..ఈయన చేయలేని పాత్ర అంటూ ఏదీ లేదు. ఒకవైపు రచయితగా మరోవైపు నటుడిగా ఒక గొప్ప దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించారు. రాజేంద్రప్రసాద్ సినిమా లేడీస్ టైలర్ చిత్రంలో పోలీస్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి రచయిత కూడా ఆయనేనట.. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా డైరెక్టర్ వంశీ నీ బ్రతిమలాడి ఒక చిన్న పాత్ర చేశాడు.
ఆ తర్వాత రెండేళ్లు నటనకి దూరమైపోయాడు. ఆ తర్వాత నువ్వు నటించాల్సిందే అని రాంగోపాల్ వర్మ చెప్పడంతో పాటు.. శివ ఈ చిత్రానికి కథ మరియు మాటలు అన్నీ తనికెళ్ళ భరణి అందించాడు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని అందించిందో చెప్పనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే తనికెళ్ళభరణి జాతకం ఈ సినిమాతోనే మారిపోయింది .ఎందుకంటే అప్పటినుంచి అవకాశాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి.
తనికెళ్ల భరణి ఏడాదికి కనీసం 10 సినిమాలు చేసేవారు అంతలా డిమాండ్ ఉంది. ఈయన ఏన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగించారు.కానీ తనికెళ్ల భరణి మాత్రం ఇప్పటి తరం హీరోల సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు.ఇదిలా ఉండదా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన మనసులో ఏది దాచుకోరు.. ఏ ప్రశ్న అడిగిన దాపరికం లేకుండా తెలియజేస్తూ ఉంటారు.
అలా ఆయన సినిమాలు చేస్తున్న రోజుల్లో బాలీవుడ్ హీరోయిన్ రేఖ అంటే ఆయనకు ఎంతో పిచ్చి అట. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా కూడా రేఖను చూస్తే అదో ఫీలింగ్ కలుగుతుందట.. ఇప్పటికీ కూడా ఆయన వన్ సైడ్ లవ్ కొనసాగిస్తూనే ఉన్నాడట..అంతేకాకుండా తన పుస్తక ఆవిష్కరణకు ఆమెని ముఖ్య అతిథిగా పిలవాలని అలా ప్రయత్నాలు చేశారట. కానీ అది కుదరటం లేదని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చాడు.