విజయశాంతి, రమ్యకృష్ణ మాదిరిగా సీనియర్ హీరోయిన్ సుహాసిని వరుస సినిమాలు చేయకపోవటానికి కారణం ఏంటి.. అనే ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తుంది.. విజయశాంతి, సుహాసిని, సుమలత లాంటి సీనియర్ హీరోయిన్స్ జనరేషన్లో వారి అందరికంటే ఎంతో ప్రత్యేక స్థానం దక్కించుకుంది సుహాసిని.. ఆమె తోటి హీరోయిన్లు అందరూ గ్లామర్ షోకు అందాల ఆరబోతకు నో చెప్పేవారు కాదు.
అయితే సుహాసిని మాత్రం ఆ విషయంలో ఎప్పుడు తన లిమిట్స్ క్రాస్ చేయలేదు.. హోమ్లీ హీరోయిన్గా, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఈమె చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. పిల్లలు సంసారం అంటూ దాదాపు పదేళ్ళ గ్యాప్ తీసుకుంటారు.
ఆ తర్వాత నటించాలని ఆసక్తి ఉంటే అదృష్టం కొద్దీ అవకాశాలు వస్తే మొహానికి రంగేసుకుంటారు. లేదంటే అంతే. అయితే, ఇలాంటి సీనియర్ హీరోయిన్స్ను ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి ఇప్పటి స్టార్ డైరెక్టర్లు తెరమీదకి తీసుకొస్తున్నారు. ఎక్కువగా ఇలా సీనియర్ నటీమణులను మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్న ఘనత మాటల మాంత్రీకుడికే దక్కింది.
అత్తారింటికి దారేదీ సినిమాతో నదియా బాగా పాపులర్ అయింది. ఈమెను మిర్చీ సినిమాతో తీసుకొచ్చింది కొరటాల శివ అయినా ఎక్కువగా మాత్రం క్రెడిట్ త్రివిక్రమ్ అందుకున్నారు. అలాగే ఖుష్బూని అజ్ఞాతవాసి సినిమాలో నటింపచేశారు త్రివిక్రమ్. ఇలా సుహాసినీ, తులసి లాంటి వారు ఇప్పుడు వెండితెరపై వెలుగుతున్నారు. అయితే, అందరికంటే కూడా తక్కువ సినిమాలు చేస్తుందీ సుహాసిని మణిరత్నమే.
ఆమె తలుచుకుంటే ఏడాదిలో 20 సినిమాలు అవలీలగా చేయగలరు. కానీ, వచ్చిన ప్రతీ పాత్రను ఒప్పుకోవడం లేదు. పైగా చాలా సెలెక్టివ్గా దర్శకులను చూసి సినిమా ఒప్పుకుంటున్నారు. దానివల్లే సుహాసిని టాలీవుడ్లో అంతగా కనిపించడం లేదు.