యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరికొద్ది రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శర్వానంద్ ఏడడుగులు వేయబోతున్నాడు. జనవరిలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్, రక్షిత రెడ్డిల వివాహం జరగబోతోంది.
రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పట్లు జరుగుతున్నాయి. మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులందరూ శర్వా వివాహ వేడకకు హాజరు కానున్నారట. ఆల్రెడీ అందరికీ ఆహ్వాన పత్రికలు కూడా వెళ్లాయట.
అయితే తాజాగా శర్వానంద్ ప్రగతి భవన్లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ని కలుసుకున్న శర్వానంద్.. ఆయనకు వెడ్డింగ్ కార్డును అందజేశారు. ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చి నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న శర్వానంద్.. బాగా బక్కచిక్కిపోయి కనిపించాడు. అలాగే మరింత యంగ్ గా కూడా కనిపిస్తున్నారు. కాబోయే పెళ్లికొడుకు కొత్త లుక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.