పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గొప్ప నటుడే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తి కూడా. ప్రభాస్ తో కలిసి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. సాయం అడిగిన వారికి కాదనలేకుండా హెల్ప్ చేస్తాడు. ఇక ఒక్కసారి ప్రభాస్ అతిథి మర్యాదలు స్వీకరిస్తే.. జీవితంలో మరచిలేరు. ప్రభాస్ నిజంగా గొప్పోడే రా అనడానికి తాజాగా మరో సంఘటన బయటకు వచ్చింది.
కన్నయ్య అలియాస్ రంజిత్ అనే వ్యక్తి ప్రభాస్ కు విరాభిమాని. కానీ, ప్రస్తుతం అతడు బతికి లేడు. మందు లేని ఓ రేర్ క్యాన్సర్ కు గురి కావడంతో.. కొద్ది రోజుల క్రితమే అతడు చనిపోయాడు. అయితే చనిపోవడానికి ముందు కన్నయ్య కోరికలను తీర్చాలని తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. దాంతో అతడికి నచ్చిన ప్లేస్ లకు తీసుకెళ్లారు. ఇష్టమైన ఆహారన్ని తినిపించారు.
చివరగా హీరో ప్రభాస్ ను కలవాలని ఉందంటూ కన్నయ్య చెప్పారు. దాంతో ఆయన తల్లి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ భార్య లావణ్యకు కాల్ చేసి విషయం చెప్పారు. ఆ విషయాన్ని ప్రభాస్ కు చెప్పగా.. క్షణం ఆలోచించకుండా కన్నయ్య, అతడి కుటుంబసభ్యులను ఇంటికి పిలిపించుకున్నాడు. కన్నయ్యకు ఇష్టమైన వంటకాలను చేయించి స్వయంగా వడ్డించాడు. అలాగే ఏం కావాలని అడగ్గా.. బాహుబలిలో వాడిన ఏదైనా వస్తువు ఇవ్వండి అని అడిగాడట కన్నయ్య. దాంతో తాను బాహుబలిలో వాడిన కత్తిని గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రభాస్. అలాగే కన్నయ్య దాదాపు అరగంట పాటు టైమ్ స్పెండ్ చేసి అతడిని సంతోషపెట్టాడు. ఇదంతా గత ఏడాది జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో అభిమానులే కాదు నెటిజన్లు కూడా ప్రభాస్ గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు.