ఆ ఇద్దరు హీరోలపై కన్నేసిన పవిత్ర లోకేష్.. వారి కోసం అదేనా చేస్తానంటూ..

సీనియర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్ పేరు సెన్సేషన్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పవిత్రా లోకేష్, నటుడు నరేష్ లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తపై స్పందించిన పవిత్ర, నరేష్ లు అందరూ మాట్లాడుకునేది నిజమే అని చెప్పడమే కాకుండా త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ చాలా విషయాల గురించి వెల్లడించారు. పవిత్ర తనకు ఇద్దరు హీరోలు అంటే క్రష్ అని తెలిపారు.

పవిత్ర లోకేష్ స్కూల్‌లో చదువుకునేటప్పుడు అక్కినేని నాగార్జున నటించిన ‘గీతాంజలి’ సినిమా విడుదల అయిందట. ఈ సినిమా చూసిన వెంటనే పవిత్ర కి నాగార్జున అంటే క్రష్ మొదలైందట. పెళ్లి అంటూ చేసుకుంటే నాగార్జున లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు పవిత్ర తెలిపారు. ఆ తరువాత ఆమెకి బాగా నచ్చిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అని తెలిపారు. నాగార్జున తరువాత ఆ రేంజ్ లో నటించగలిగే వ్యక్తి ప్రకాష్ రాజ్. అందుకే నాగార్జున, ప్రకాష్ రాజ్ లు ఇద్దరు ఆమె క్రష్ అని తెలిపారు పవిత్ర లోకేష్. ప్రస్తుతం పవిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.