ఆది పురుష్.. తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు బిజినెస్ తెలిస్తే షాకే..!!

ప్రభాస్ నటించిన ఆది పురుష్.. చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇటీవల ట్రైలర్ విడుదల చేసి అమాంతం మంచి హైప్ ని ఏర్పరచుకుంది. ప్రభాస్ రాముడు లుక్ లో కనిపించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీఖాన్.. తదితరులు సైతం నటిస్తున్నారు.

Adupurush Trailer Launch: Adipurush trailer launch: Prabhas, Kriti Sanon  attend Hyderabad event - The Economic Times

ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల 16వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది. ఇప్పటికె ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయగా త్వరలోనే సెకండ్ సాంగ్ రాబోతున్నట్లు తెలియజేశారు. త్వరలోనే ఆది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తుగా తిరుపతిలో చేయబోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే ఇప్పటికే ఈ సినిమా పైన నెలకొన్న హైపు కారణంగా థియేటర్ నాన్ థియేటర్ల్ రైట్స్ ఒక రేంజ్ లో పోటీపడ్డాయని తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా థియేట్రీకల్ రైట్స్ రూ.170 కోట్ల రూపాయలు దక్కించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం ఏరియాకి రూ.80 కోట్ల వరకు డిమాండ్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల హక్కును ఒక బడా నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.