తెలుగు సినీ ఇండస్ట్రీలో గడిచిన కొన్ని నెలల నుంచి ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు డిజాస్టర్ చిత్రాలు సైతం విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మహేష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్ తదితర హీరోల సినిమాలు విడుదల చేసి మంచి విజయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోస్ మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ సైతం సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎమ్మెస్ ధోని చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది చిత్ర బృందం. టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. రాజమౌళి కి కూడ ధోని బ్యాటింగ్ అంటే ఆయన ఆట తీరు చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. ధోని జీవిత కథ ఆధారంగా వచ్చిన ఎమ్మెస్ ధోని చిత్రంలో ఆయన ప్రేమ పెళ్లి గురించి మాత్రమే కాకుండా క్రికెట్ ప్రస్థానాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడం జరిగింది.
ఎమ్మెస్ ధోని ది ఆల్టోల్డ్ స్టోరీ అనే టైటిల్తో 2016లో ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించారు హీరోయిన్స్ గా దిశాపటాని కియారా అద్వానీ నటించారు. డైరెక్టర్ నీరత్ పాండే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఇప్పుడు రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు.. ధోని బర్తడే కానుకగా ఈ చిత్రాన్ని జులై 7వ తేదీన గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.