టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ కీయారా అద్వానీ సుపరిచితమే.. ఇక బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మలహోత్రాలను వివాహం చేసుకుంది. ఇక పెళ్లి విషయానికి వస్తే ముందుగానే కండిషన్స్ పెడుతూ పెళ్లి తర్వాత ఎలా ఉండాలో నేర్పిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలా టాలీవుడ్ లో ఈ మధ్యనే హీరోలకు కండిషన్లు పెట్టి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు..
ఒక టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కియానా అద్వానీ ఈమె కూడా తన భర్తకి కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కియానా అద్వానీ ఎక్కువ హిందీ సినిమాలలోనే నటించింది. అయితే భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. చాలా వరకు ఈమె తీసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ నీ అందించాయి.
అయితే ఈమె కొంతకాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.అయితే ఈ సమయంలో ఈ బ్యూటీ గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది.అదేంటంటే తన భర్తకు పెళ్ళికి ముందే కండిషన్ పెట్టిందట. ఒకవేళ మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కానీ ఏదైనా వ్యక్తిగత విషయంలో మనకు సమస్యలు వస్తే విడాకులు తీసుకునేదే లేదని ఒకవేళ విడాకులు తీసుకున్న తరువాత నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే అది మళ్లీ నన్నే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టిందట.
ఈ మాటలు విన్న సిద్ధార్థ ఎప్పటికైనా నువ్వే నా భార్యవి అంటూ దగ్గరికి హత్తుకున్నాడట. ఇలా కండిషన్ పెట్టిన కియానా అద్వానీకి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాగే అన్ని జంటలు ఆలోచిస్తే విడాకులు అనే పదమే ఉండదని సినీ అభిమానులు తెలియజేస్తున్నారు.