మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న కియారా అద్వానీ.. ధ‌ర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ మ‌రో ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేసింది. ఇప్ప‌టికే ఆమె గ్యారేజ్ లో ప‌లు ఖ‌రీదైన కార్లు సేద తీరుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మ‌రో కాస్ట్లీ కారు వ‌చ్చి చేరింది. మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును కియారా త‌న సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో అత్యంత సౌక‌ర్య‌వంతంగా ఉండే ఈ కారు ధ‌ర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే.

ఎందుకంటే.. కియారా అద్వానీ కొనుగోలు చేసిన కారు ఏకంగా రూ. 3 కోట్లు. మే 26న తన పేరు మీద ఈ కొత్త ల‌గ్జ‌రీ కారును కియారా రిజిస్ట్రేషన్ చేయించుకుంద‌ట‌. ఇక‌పోతే ఇటీవ‌లె హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఏడ‌డుగులు వేసి ఓ ఇంటిది అయిన కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది.

అలాగే చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. అదే `గేమ్ ఛేంజ‌ర్‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంటే.. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల అయ్యే అవకాశాలు ఉన్నాయి.