టాలీవుడ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. తాజాగా లావణ్య త్రిపాఠి డబ్బు పిచ్చి ఉంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఎటువంటి వారైనా సరే డబ్బు ఉంటే దగ్గరికి తీసుకుంటుందని డబ్బు లేకుంటే వాళ్ళని దూరం పెట్టేస్తుంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అభిమానులు మాత్రం లావణ్య త్రిపాఠి ని కేవలం కొంతమంది కావాలని టార్గెట్ చేస్తూ ఇలాంటి బ్యాడ్ వార్తలని వైరల్ గా చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీస్ ఉత్తరకాండగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా పేరు సంపాదించినప్పటికీ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. 2008లో అందాల రాక్షసి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హిందీ తమిళ్లో కూడా తొలి చిత్రాలలో నటించింది. స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆమధ్య సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది.
ఈమధ్య ఓటీటి లో విడుదలైన పులి మేక అనే వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ముద్దుగుమ్మ హవా తగ్గిపోయింది. లావణ్య త్రిపాఠి ఎక్కువగా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ వారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉందని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.. వరుణ్ తేజ్ కంటే ముందు ఒక హీరోతో ప్రేమలో ఉందట ..ఆ హీరో ఎవరో కాదు అందాల రాక్షసి సినిమాలో నటించిన నవీన్ చంద్ర అన్నట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.. నవీన్ చంద్రకు పెద్దగా బ్యాగ్రౌండ్ లేదని ఆస్తులు కూడా లేవని ఆ సమయంలో వరుణ్ తేజ్ తో ఏర్పడిన స్నేహం కారణంగా అతనికి హ్యాండ్ ఇచ్చి డబ్బున్న వరుణ్ తేజ్ వెంటపడిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.