అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మనం మూవీతో తొలిసారి ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఇందులో ఆమెది చిన్న పాత్రే అయినా.. ఆ తర్వాత వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాశి ఖన్నా ఒక మెరిట్ స్టూడెంట్. ఢిల్లీకి చెందిన ఈ అందాల సోయగం.. సెయింట్ మార్క్ సీనియర్ సెకండర్ పబ్లిక్ స్కూల్ లో స్కూలింగ్ కంప్లీట్ చేసిన రాశి ఖన్నా.. లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. కాలేజీ టాప్ కూడా.
అయితే సింగర్ కావాలనుకున్న రాశి ఖన్నాకు తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే షాకైపోతారు. ఓ షాపింగ్ మాల్ లో ఉచితంగా వచ్చే ఫెయిర్నెస్ క్రీమ్ కోసం ఓ సెల్ఫీ దిగిందట. ఆ సెల్ఫీ రాశి ఖన్నా లైఫ్ నే మార్చేసింది. ఆ సెల్ఫీ ద్వారానే రాశి ఖన్నాకు బాలీవుడ్ మూవీ `మద్రాస్ కేఫ్` మూవీలో తొలి అవకాశం వచ్చింది. ఈ మూవీలో రాశి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టగా.. ఇక్కడ ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.