ఓట్లు లేపేస్తున్న వైసీపీ..యాంటీ లేకుండా..!

అధికార వైసీపీ వేసే ఎత్తులు ఊహించని విధంగా ఉంటాయి. ఆ పార్టీ చేసే రాజకీయానికి ప్రతిపక్షాలకు చిక్కులు  తప్పవు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా వైసీపీ రాజకీయం నడుపుతుంది. దాని వల్ల ప్రతిపక్షాలకు చెక్ పెడుతుంది.గత ఎన్నికల ముందు అలాగే చేసింది..ఇప్పుడు అదే తరహాలో వైసీపీ ముందుకెళుతుంది. ఇక వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలతో టి‌డి‌పికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే రెండు అంశాల్లో టి‌డి‌పిని ఇరుకున పెట్టాలని చూస్తుంది.

నిజానికి వివేకా హత్య కేసులో వైసీపీకే నెగిటివ్ అవుతుంది..కానీ వివేకా కుమార్తెతో టి‌డి‌పితో కుమ్మక్కు అయ్యారని, ఆమె టి‌డి‌పిలో చేరబోతున్నారంటూ వైసీపీ ఫేక్ పోస్టర్లు వేస్తుంది. అంటే దీని ద్వారా వివేకా కుమార్తె సునీత, టి‌డి‌పితో కుమ్మక్కు అయ్యారని జనం అనుకోవాలని చేస్తున్నారు. అటు ఓ మీటింగ్ లో లోకేష్..దళితులకు జగన్ పీకింది ఏమి లేదని అన్నారు. ఇక ఆ వీడియోని వైసీపీ ఎడిట్ చేసి..దళితులు పీకింది ఏమి లేదని లోకేష్ అన్నారని క్రియేట్ చేశారు. అంటే వైసీపీ రాజకీయం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే వైసీపీ ఎన్ని ఎత్తులు వేసిన వాటిని టి‌డి‌పి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.  అయినా సరే మరొక రూపంలో వైసీపీ రాజకీయం చేస్తుంది. ఎలాగైనా తమకు వ్యతిరేక ఓట్లు ఎక్కువ ఉండకూడదని టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఇంటింటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లని అంటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక స్టిక్కర్లు అంటించుకున్న వారికి ఇబ్బంది లేదు..అలా కాకుండా స్టిక్కర్లు చింపేసిన వారిని, అతికించుకొని వారి ఇళ్లని నోటు చేసుకుని, వారి ఓట్లు లేపేసేందుకు వైసీపీ కసరత్తు చేస్తుందని తెలిసింది. ఓటర్ల లిస్టులో వారి పేరు వచ్చేలా చేసి..బూత్ మార్చేసి..చివరికి ఓట్లు లేకుండా చేయడమే వైసీపీ టార్గెట్ అని తెలుస్తోంది. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు పోతాయో.