ఆ స్టార్ హీరో కూడా హీరోయిన్ చేతిలో దారుణంగా మోసపోయారా..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో నితిన్ కూడా ఒకరు..మొట్ట మొదటిగా 2022లో జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. నితిన్ నటించిన సినిమాలన్నీ లవ్ స్టోరీ కి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. జయం సినిమా సక్సెస్ తో ప్రేక్షక ఆదరణ పొందాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందాడు.అయితే ఈ మధ్య నితిన్ సక్సెస్ లకు కొద్దిగా దూరమైతున్నాయని చెప్ప వచ్చు.

Nithin's Debut Film Jayam Completes 20 Years Of Release; Here's How Much It  Collected

గతంలో నితిన్ నటించిన సినిమాలు బాగానే సక్సెస్ సాధించాయి.కానీ ఇప్పట్లో నటిస్తున్న సినిమాలు కాస్త అటు ఇటుగా బోల్తా కొడుతున్నాయి.అంతే కాకుండా అప్పట్లో నితిన్ వరుస సినిమాల్లో నటించేవాడు కానీ ఇప్పుడు చాలా గ్యాప్ తో ఒక్క సినిమాతోనే నటిస్తున్నారు. ఈ మధ్యనే మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలైన ఫ్లాప్ గా నిలిచింది .అయితే చాలామంది ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఆ సినిమా డిజార్డర్ టాక్ సొంతం చేసుకుంది.

మాచర్ల నియోజకవర్గం సినిమాలోనే నితిన్ కి మోసం జరిగింది. అదేమిటంటే కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఐటెం సాంగ్కు అంజలిని తీసుకున్నారు. కానీ ఆ ఐటెం సాంగ్ కు అంజలి కంటే ముందే సదాను అనుకున్నారట సదా కూడా దీనికి ఓకే చెప్పిందని సమాచారం..అలా చెప్పినట్టే చెప్పి నమ్మించి హ్యాండ్ ఇచ్చిందట. అంతేకాకుండా ఒకప్పుడు నీతో హీరోయిన్గా చేశాను ఇప్పుడు ఐటెం గర్ల్ గా ఎలా చేస్తాను అని ప్రశ్నించిందట. దీంతో సదా మోసం చేసిందని నిర్మాతలు లాస్ట్ నిమిషంలో నాలుగు కోట్లు ఇచ్చి అంజలితో డాన్స్ చేయించారట.అలా నితిన్ ని మోసం చేసినందుకు ఆమెకు తగిన శాస్త్రి జరిగిందంటు నితిన్ అభిమానులు అనుకుంటున్నారు. ఇక సదా కి ఇప్పటివరకు ఏ అవకాశం కూడా రాలేదు. కాబట్టి బుల్లితెర షోలలో యాంకర్ గా చేస్తోంది.