వీరసింహారెడ్డి..100 విజయోత్సవం.. ఎక్కడంటే..?

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు..బాలయ్య ఈ వయసులో కూడా తన సినిమాలను తెరకెక్కించి కుర్ర హీరోలకు పోటీగా తమ సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. అలా మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంటున్నారు. గత ఏడాది అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ.. ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించారు. ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యింది.

బాలయ్య సరసన శృతిహాసన్ ,హాని రోజ్ నటించారు. బాలయ్య చెల్లెలి పాత్రలో మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.. విలన్ గా దునియా విజయ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ .130 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే కొన్ని చోట్ల ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది అంటూ నిర్మాతలు తెలియజేశారు అందుకు కూడా 100 రోజుల ఫంక్షన్ ని ఏప్రిల్ 23న గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు ఈవెంట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు..ఎవరు హాజరు కాబోతున్నారని విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని తెలియజేశారు.

ప్రస్తుతం బాలయ్య 108వ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా.. కూతురి పాత్రలు శ్రీ లీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి వీరిద్దరూ షూటింగ్ సెట్లో అడుగుపెట్టినట్లుగా తెలియజేశారు. ఈ చిత్రం నుంచి ఇదివరకే ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై బాగానే ఆకట్టుకుంది. విరసింహారెడ్డి 100 రోజుల సెలబ్రేషన్స్ గురించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

https://twitter.com/MythriOfficial/status/1648244243553742848?s=20