వాణి భోజన్ కోలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇమే పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈ అమ్మడికి లక్ రూపంలో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. తమిళంలో తమిళ రాకర్స్ ధ్రువం-2, తదితర వంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎఫైర్ విషయంలో జోరుగా వార్తలు వినిపించాయి.తమిళ యాక్టర్ జై తో రిలేషన్షిప్ లో ఉందంటూ గడిచిన కొద్ది రోజులుగా మీడియాలో కథలు వినిపించాయి..
జై తో ఈమె సన్నిహిత్యంగా ఉన్నప్పటి నుంచి ఆమె పైన కేరింగ్ మరింత పెరిగిపోయిందని చివరికి ఆమె బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కాల్ సీట్లు సర్దుబాటు చేయడం కూడా జై నే చూసుకొని స్థాయికి వెళ్ళాడు అనే విషయం కోలీవుడ్లో బాగా వినిపించాయి.చివరికి ఆ ప్రచారం ఏ స్థాయికి చేరిందంటే.. దీనివల్ల వాణి భోజన్ కు అవకాశాలు కూడా తగ్గిపోయాయని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా ఈ అమ్మడు తాజాగా ఈ విషయం పైన స్పందించింది.
నేను జై ట్రిపుల్స్ వెబ్ సిరీస్ లో నటించాము ఇది తన జీవితంలో నిజంగా చోటు చేసుకున్న సంఘటన జైతో రిలేషన్షిప్ అన్న బాధపడను కానీ లివింగ్ టుగెదర్ అనడమే మనసుకు గాయపరిచింది.. నేను కష్టపడి బ్యాంకు లోన్ తీసుకొని మరి ఇంటిని నిర్మించుకుంటే దానిని కూడా తప్పు పట్టారు.. ఎవరితో ఒకరి ఇంట్లో అతనితో కలిసి ఉంటోందని ప్రచారం చేశారు.. ఇంత చీప్ గా వార్తలు ఎలా రాస్తారని ..నాకు తెలియదు.. సమాజంలో చెడు వేగంగా పాకి పోతుంది అంటూ తెలియజేసింది. తన విషయంలో కూడా ఇదే జరుగుతోంది నిజాలు నెమ్మదిగా వస్తాయి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి అంటూ వాణి భోజన్ క్లారిటీ ఇచ్చింది.