మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పెళ్లి జరిగిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి అందరితో పంచుకున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండండి బిడ్డకు జన్మనివ్వబోతోంది.
ప్రస్తుతం ఆమెకు ఏడో నెల అని అంటున్నారు. అయితే అందరికీ ఒకటే డౌట్. ఏడు నెలలోనూ ఉపాసనకు బేబీ బంప్ కనిపించడం లేదు. అసలే కొద్ది రోజుల నుంచి ఉపాసన సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఉపాసనకు బేబీ బంప్ కనిపించకపోవడం, ఆమె తరచూ టూర్స్ కు వెళ్లడం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
అయితే తాజాగా ఉపాసన తనకు బేబీ బంప్ కనిపించకపోవడానికి కారణం ఏంటో రివీల్ చేసింది. తాజాగా ఓ ఆభరణాల షో రూమ్ లాంఛింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఉపాసన `కడుపులో బిడ్డతో టూర్స్ తిరగడం ఆనందంగా ఉంది. మాతో పాటు బిడ్డ కూడా ప్రపంచాన్ని చుడుతున్నాడు. గర్భం దాల్చిన మహిళలు బాగా బరువు పెరుగుతారు. అయితే నేను కఠిన డైట్ ఫాలో అవుతున్నాను. బరువు పెరగకుండా చూసుకుంటున్నాను. అలా అని తినకుండా ఉండటం లేదు. నా కోసం బిడ్డ కోసం పోషకాహారం మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే బేబీ బంప్ కనిపించకపోవడానికి కారణం నేను ధరించే దూస్తులే` అని తెలిపింది. దీంతో ఉపాసన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.