ఉండవల్లితో వైసీపీ రాజకీయం..కోటంరెడ్డి టార్గెట్ అందుకేనా?

ఏపీ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో లేకపోయినా..ఆయన ఎప్పుడు రాజకీయాలే చేస్తారని చెప్పవచ్చు. అది కూడా జగన్‌కు అనుకూలంగా ముందుకెళుతు ఉంటారు. జగన్‌కు పరోక్షంగా సాయం చేస్తుంటారనే చెప్పాలి. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా, ఆ ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో విమర్శించారో చెప్పాల్సిన పని లేదు. జగన్‌కు లబ్ది జరిగేలా ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేవారు.

అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది..ఇప్పుడు కూడా మీడియా సమావేశాలు పెడుతున్నారు..కాకపోతే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లే కనిపిస్తారు గాని..అవి పరోక్షంగా జగన్ కు హెల్ప్ చేస్తున్నట్లు ఉంటాయి. ఆయనకు పరోక్షంగా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక ఉండవల్లి..రామోజీరావుని ఎలా టార్గెట్ చేస్తారో తెలిసిందే. మార్గదర్శి కేసుని ఇప్పటికీ వదలలేదు. ఇక ఇప్పుడు మార్గదర్శి టార్గెట్ గా జగన్ ప్రభుత్వం ముందుకెళుతు..రామోజీని ఇరుకున పెట్టేలా వెళుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ విషయంలో ఉండవల్లిని వాడుకుని..మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..ఉండవల్లి టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఉండవల్లి అరుణ్‌కుమార్‌… ఏపీలోని రాజకీయ నేతల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మీరు వైసీపీ ట్రాప్‌లో పడి అపఖ్యాతి పాలుకావద్దు’’ అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

ఈనాడు, మార్గదర్శి సంస్థలపై ఉండవల్లితో ఢిల్లీలో బుధవారం అసత్యాలు, అవాస్తవాలను వెల్లడించే ప్రయత్నం చేయబోతున్నారని, ఇందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు నేతృత్వం వహిస్తున్నారని, ఆయన రాజకీయ దళారీగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవలం ఆరు నెలలే తన హవా చూపగలరని, ఆ తరువాత ప్రభుత్వం మారుతుందన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాలని చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఉండవల్లి..రామోజీని టార్గెట్ చేసి ఎలా ముందుకెళ్తారో.