హీరో రామ్ చరణ్ నటించిన చిత్రాలలో రంగస్థలం సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. 1980 లో నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం కావడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా 2018 మార్చి 30వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టింది.ఇందులో రామ్ చరణ్ నటనకు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా అందుకున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా సమంత హీరోయిన్గా నటించిన అనసూయ కీలకమైన పాత్రలో నటించింది. అలాగే ఆది పినిశెట్టి ,జగపతిబాబు ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా దాదాపుగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లుగా సమాచారం .అయితే ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రేయసిగా నటించిన అమ్మాయి ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటుంది. కనిపించింది తక్కువ సమయమే.. అయినా ఈమె చుట్టు కథ తిరుగుతూ మలుపు తిరుగుతుంది.
ఆది పినిశెట్టి ప్రేయసిగా నటించిన అమ్మాయి పేరు పూజిత పొన్నాడ.. ఈ సినిమా హిట్ కావడంతో తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి రంగస్థలం సినిమా తర్వాత ఏమి వేర్ ఇస్ వెంకటలక్ష్మి, బ్రాండ్ బాబు, 7 సినిమాలలో నటించింది.. ఈమె ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన అమ్మాయి
ఇమే ఇంజనీరింగ్ పూర్తి చేసి టాటా కాన్సెంటిలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత నటన పైన ఆసక్తి ఉండడంతో 2015లో ఉప్మా తినేసింది అని షార్ట్ ఫిలిం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016లో తుంటరి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవలే రావణాసుర చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఈమె స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం.