పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయంగా కూడా బాగా చురుకుగా పాల్గొంటున్నారు. ఇక గత ఏడాది దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా బస్ యాత్రను నిర్వహించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అంతేకాగ అందుకోసం ఒక ప్రత్యేకంగా వారాహి అనే వాహనాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేసి వాటికి పూజలు చేయించి చాలా హడావిడి కూడా చేయడం జరిగింది.
కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ ఏడాది ఎన్నికలు లేని కారణంగా పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతున్నారు అంటూ కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది జనసేన పార్టీ బలోపేతం కావాలి అంటే కచ్చితంగా బస్సు యాత్రను ప్రారంభించాలి అంటూ తమ అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర వల్ల పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను పోస్ట్ పోన్ చేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పార్టీకి మద్దతుగా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ను ఒంటరిగానే ఎన్నికలలో నిలబడి తమ సత్తా చాటాలని కోరుకుంటున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర విషయంలో మాత్రం పలు రకాలుగా రూమర్లు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ మాత్రం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న ఈ విషయంలో మాత్రం ఎక్కడ స్పందించలేదు. మరి వారాహి యాత్రను ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి మరి.