స‌మంత‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న తేజ్‌.. నోరు తెరిస్తే అదే జపం!

శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్ లో సమంత మాటిమాటికీ విడాకుల త‌ర్వాత ఎదురైనా చేదు అనుభ‌వాలు, క‌ష్టాలు, మ‌యోసైటిస్ వ్యాధికి గురి కావ‌డం వంటి అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ వార్త‌ల్లో నిలిచింది. ఎమోష‌న‌ల్ కామెంట్స్ తో సింప‌థీని క్రియేట్ చేసి శాకుంత‌లంపై భారీ హైప్ క్రియేట్ చేయాల‌ని చూసింది. కానీ, శాకుంత‌లం బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. స‌మంత ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది.

అయితే స‌మంత‌ను ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. తేజ్ త్వ‌ర‌లోనే `విరూపాక్ష‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్నాడు. కార్తీక్ వర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సుకుమార్ ఈ మూవీకి క‌థ అందించాడు. ఏప్రిల్ 21న ఈ థ్రిల్ల‌ర్ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత తేజ్ నుంచి రాబోతున్న తొలి చిత్రం ఇది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి.

అయితే ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లోనూ సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న యాక్సిడెంట్‌ గురించే ప్ర‌స్తావిస్తున్నాడు. నోరు తెరిస్తే అదే జ‌పం చేస్తున్నాడు. తాజాగా కూడా `రోడ్డు మీద పడిన తర్వాత మళ్లీ కళ్లు తెరిచి చూసింది మా అమ్మనే. అమ్మకు సారీ చెబుదామంటే? నోట మాట కూడా రాలేదు. నిలబడలేక పోయేవాడిని. అప్పుడే ఎంట్రా ఈ జీవితం అనిపించింది.` అంటూ ఎమోష‌న‌ల్ కామెంట్స్ తో సింప‌థీ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈ విష‌యంలో తేజ్ ను కొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు.