బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కంటే తాను ధనవంతుడిని అంటూ ఆస్తుల వివరాలు బయయపెట్టాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈయన `విరూపాక్ష` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాపినీడు. బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు.
ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. హర్రర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కంటే తాను ధనవంతుడిని అంటూ కామెంట్స్ చేశాడు.
డబ్బు కంటే విలువైన ప్రేక్షకుల ప్రేమ తనకు దక్కిందని.. అందుకే తాను వారి కంటే ధనవంతుడిని అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందా అంటే అది ప్రేక్షకుల ప్రేమాభిమానమే అని.. వాళ్లందరి ఆశీస్సుల వల్లే ఇలా ఉన్నానని, ఇంతమంది ప్రేమను పొందినందకు ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తేజ్ ఎమోషన్ కామెంట్స్ చేశారు. కాగా, బైక్ యాక్సిడెంట్ తర్వాతే తేజ్ నుంచి రాబోతున్న తొలి చిత్రమిది. ఈ మూవీతో హిట్ కొడతానని తేజ్ చాలా ధీమాగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తెలియబోతోంది.