టాలీవుడ్ లో అలనాటి నటిమనులలో నటి లక్ష్మీ కూడా ఒకరు. ఇక ఈమె కుమార్తె ఐశ్వర్య భాస్కర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది. తెలుగులో పాటు ఈమె తమిళ్, మలయాళం వంటి చిత్రాలలో నటించి సత్తా చాటారు. తాజాగా ఇమే మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఆన్లైన్లో తాను ఎదుర్కొన్న కొన్ని లైంగిక వేధింపుల పైన కూడా మాట్లాడడం జరిగింది.
ఐశ్వర్య భాస్కర్ మాట్లాడుతూ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో మల్టీ మమ్మీ లోని ఒక వీడియో పై స్పందించింది.. చాలామంది నేటిజన్స్ ఆన్లైన్లో తనకు అసహ్యకరమైన సందేశాలను పంపించారని దీంతో చాలా బాధపడ్డానని తెలిపింది. అంతేకాకుండా కొన్ని ఫోటోలు మెసేజ్లు కూడా తనను మానసికంగా వేదనకు గురి చేశాయని ఐశ్వర్య తెలియజేశారు. ఒక వ్యక్తి తనకు అర్ధరాత్రి ఒక మెసేజ్ పంపించారని ఇప్పుడు ఇంటికి వచ్చి సబ్బులను చూపించమని కోరాడని తెలియజేస్తోంది.
ఐశ్వర్య యూట్యూబ్ ద్వారా తన చానల్లో పలు రకాలుగా వంటలు సభ్యుల తయారీ పలు ఆధ్యాత్మిక వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అలా అప్పుడప్పుడు ఇమే సబ్బులు కూడా అమ్ముతూ ఉంటుంది.ప్రస్తుతం నటనపరంగా అవకాశాలు లేకపోవడంతో సబ్బుల వ్యాపారంతో బాగానే సంపాదిస్తున్నట్లు తెలియజేసింది. ఒంటరిగా ఉన్న ఈమెకు చాలామంది పురుషుల సైతం ఆన్లైన్లో లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నారని తెలియజేసింది.ఈ విషయంలో ఆమె తనకు జరగు తున్న కొన్ని వేధింపులను తెలియజేయడంతో పలువురు నెటిజన్లు ఈమెకు సపోర్టు చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఐశ్వర్య ప్రస్తుతం ఆర్థిక లావాదేవులతో బాధపడుతున్నది. అవకాశాలు లేక డబ్బులు లేక ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.