ఆ హీరో తో రొమాన్స్.. హీరోయిన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఖుష్బూ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ కూడా ఒకరు. ఎలాంటి విషయాన్నీ అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు అడపా దడప్ప సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమిళ సినిమాలే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఉండేది ఖుష్బూ.. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా కనిపిస్తూ ఉండేది. తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది కుష్బూ.

ఈ క్రమంలోనే తాజాగా ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొనడం జరిగింది. హీరోయిన్ టబుకి గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా తెలియజేస్తోంది. అమితాబ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన ఖుష్బూ.. చీనికం సినిమాలో టబు అమితాబ్ తో కలిసి రొమాన్స్ చేయడం చూసి తట్టుకోలేకపోయానని చిన్నప్పుడు అమితాబ్ తో కలిసి నటించాలని కలలు కన్నాను.. కానీ పెద్దయ్యాక కుదరలేదు..అయితే తనకు రాణి అవకాశం టబు కు రావడంతో ఆమెకు ఫోన్ చేసి మరి తిట్టాను అమితాబ్ తో రొమాన్స్ చేస్తే తానే చేయాలి..నువ్వు ఎందుకు చేసావు ఆయనతో రొమాన్స్ చేసే హక్కు అర్హత నీకు ఉన్నాయా అంటూ చెప్పిందట.

కేవలం అదంతా అమితాపైన ఉండే ఇష్టాన్ని తెలియజేశాను అని తెలిపింది ఖుష్బూ.చిరంజీవి, బాలయ్యలతో కలిసి కూడా నటించే అవకాశం వస్తుందా అంట చూస్తున్నానని తెలిపింది. తెలుగులో ఎలాగో సినిమాలు చేస్తున్నాను కాబట్టి త్వరలోనే అలాంటి అవకాశం వస్తే వదులుకోనని తెలిపింది. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించాను కానీ ఎందుకు అది ప్రేక్షకులకు నచ్చలేదని తెలిపింది.