తమన్నా, కాజల్‌లకు అరుదైన అదృష్టం.. ఇప్పటికీ ఎవరికీ దక్కలేదు??

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ కాజల్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. ఇప్పుడంటే వారు కాస్త ఓల్డ్ అయిపోయారు కానీ ఇప్పటికీ తమ చెక్కుచెదరని అందంతో అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. తమన్నా అందం రోజురోజుకూ రెట్టింపు అవుతుందే తప్ప తగ్గడం లేదు. పైగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రలు చేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇక పెళ్లయ్యి తల్లయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఏమాత్రం తగ్గడం లేదు.

ఈ అందాల చందమామ తమిళ కామెడీ హారర్ ఘోస్టీ (2023)లో చివరిసారిగా కనిపించింది. ఇప్పుడు కరుంగాపియం, ఇండియన్ 2, ఉమ అనే మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇక తమన్నా భోళా శంకర్, జైలర్, అరణ్మనై, బాంద్రా, బోలే చుడియాన్ వంటి ఐదు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. వీరికి సంబంధించి అభిమానులు ఒక సరికొత్త విషయాన్ని చర్చించడం ప్రారంభించారు. అదేంటంటే ఈ ముద్దుగుమ్మలు ఏ టాలీవుడ్ హీరోయిన్లకు దక్కని అదృష్టం దక్కించుకున్నారు. వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొడుకులతోపాటు తండ్రులతో కూడా ఎక్కువ సినిమాలు చేశారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వారి తండ్రులతో రొమాన్స్ చేయడం చాలా తక్కువ. కానీ వారిద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం తమన్నా, కాజల్‌లకు దక్కింది. ఈ ఇద్దరు భామలు పవన్ కళ్యాణ్ , చిరంజీవి, రామ్ చరణ్ వంటి మెగా హీరోల సరసన నటించారు. కాజల్ మగధీర, నాయక్ సినిమాలలో రామ్‌చరణ్‌తో జతకట్టింది. అలానే చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో రొమాన్స్ చేసింది. చెర్రీ బాబాయి పవన్ కళ్యాణ్‌ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోనూ మెరిసింది.

ఇక తమన్నా చరణ్‌తో రచ్చ, పవన్ కళ్యాణ్‌తో కెమెరామెన్ గంగతో రాంబాబు, చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలు చేసింది. ఇప్పుడు ఉన్న భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి సరసన నటిస్తోంది. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ తో కలిసి బద్రీనాథ్ సినిమా కూడా చేసింది. ఇక నాగచైతన్యతో కలిసి సినిమాలు చేసిన తమన్నా, ఊపిరి సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. వీరిద్దరూ ఇంకా యాక్టివ్‌గానే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో నాగార్జున, వెంకటేష్, తారక్ బాబాయి బాలకృష్ణతో కూడా కలిసి నటించే అవకాశం ఉంది.