రిలీజ్ కాకముందే అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ మూవీ.. ఫ్యాన్స్ ఖుషి!

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ప్రధాన తారాగణంలో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్‌, సీతమ్మ కృతిసనన్‌ను ఎలా నటించారో చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీఎఫ్ఎక్స్ బాగోలేదని చాలామంది ట్రోల్ చేశారు. దాంతో అభిమానుల్లో కాస్త నిరాశ తలెత్తింది. అయితే ఇప్పుడు వారిని ఖుషి చేసే ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది.

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్‌లో స్క్రీన్ అయ్యే ఛాన్స్ ను ఆది పురుష్ సినిమా దక్కించుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. “సంతోషానికి గౌరవానికి మించిన అనుభూతి ఏదో కలుగుతోంది. ధైర్యం, భక్తి పురాణ గాథ అయిన ఆదిపురుష్ ప్రీమియర్‌ న్యూయార్క్‌లో జూన్ 13న జరిగే ప్రతిష్టాత్మక #TribekaFestivalలో ప్రదర్శించపడుతుంది.” అని డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇది చూసిన సమయం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఓం రౌత్ ఆదిపురుష్ మూవీ నుంచి హీరో ప్రభాస్ స్టిల్‌ను కూడా పంచుకున్నాడు ఇందులో ప్రభాస్ శ్రీరాముని అవతారంలో బాణం పైకి ఎక్కుపెట్టి చాలా ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ పిక్ తో సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాస్తుందో లేదో చూడాలి.