పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఘోరం.. టాయిలెట్‌కి వెళ్లడానికి కూడా భార్య తోడు!

 

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పవచ్చు. ముక్కుసూటిగా నడుచుకునే ఈ నటుడు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆయనకు హేర్నియ ఆపరేషన్ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందట. ఆ ఇన్ఫెక్షన్ కారణంగా పోసాని ఏడు కిలోల వరకూ బరువు కూడా తగ్గారట. ఆ సమయంలో ఆయన చనిపోతారేమో అని భయం వేసింది అంటూ పోసాని కామెంట్ చేశారు.

డాక్టర్ ఎన్వీ రావు, పోసాని గురించి తెలిసి స్కానింగ్ చేయించగా అసలు సమస్య బయట పడిందట. అంతకుముందు టాయిలెట్‌కి వెళ్లడానికి కూడా అతని భార్య లేదా అక్క సహాయం తీసుకునేవారట పోసాని కృష్ణ మురళి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గెలిచిన తరువాత ప్రశాంత్ కిషోర్, పోసాని కృష్ణ మురళిని పార్టీలోకి తీసుకోవాలని సలహా ఇచ్చారట. దాంతో జగన్, పోసానిని కలవాలని కబురు చేసారట. కానీ పోసాని, జగన్ ని కలవడానికి వెళ్ళలేదని పేర్కొన్నారు.

ఆ తరువాత ఒకసారి జగన్ ని కలిసినప్పుడు పోసానిని ఎక్కడి నుండైన పోటీ చేస్తారా అని అడిగితే, పోసాని మాత్రం పోటీ చెయ్యనని చెప్పారట. అలానే పోసాని అడగకపోయినా ఏదో ఒక పదవి ఇవ్వాలని సీఎం చెప్పగా ఆయనకి పదవి ఇచ్చారని పోసాని కృష్ణ మురళి వెల్లడించారు.ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.