మరొకసారి గుడిలో నరేష్- పవిత్ర లోకేష్.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన వారిలో.. నరేష్, పవిత్ర కూడ ఒకరు.ఇక వీరి రిలేషన్ గురించి చెప్పనవసరం లేదు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈ జంట ఎక్కడో ఒకచోట హైలెట్ అవుతూనే ఉంటారు. మొన్న మంచు మనోజ్ పెళ్లిలో కనిపించారు .తర్వాత కృష్ణ ,ఇందిరా దేవి గారు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడానికి చేసిన వేడుకల్లో కనిపించారు. అయితే వీరు ఎక్కడ చూసినా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీడియా వీళ్ళపై ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు.

ఇక ఈ మధ్యకాలంలో వీరిద్దరిని జంటగా పెట్టి ఎన్నో సినిమాలను చేస్తున్నారు. ఆల్రెడీ’ ఆలీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి’. అనే సినిమాలో ఈ జంటను హైలెట్ చేస్తూ చూపించడం జరిగింది.. అలాగే నిర్మాత ఎంఎస్ రాజు ఈ జంటని హైలెట్ చేస్తూ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా కూడా తీసేస్తున్నారు .ఇది వారి నిజజీవితంలో జరగాల్సిన పెళ్లి కానీ ఇలా సినిమాలలో నటిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా… ఇటీవల నరేష్ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుపాడులో సందడి చేశారు. ఆదివారం నాడు ఆ గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకకు ఈ జంట హాజరయ్యి.. అక్కడ ఉన్న అల్లూరి సీతారామరాజు ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత అక్కడే ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక వీరిద్దరికీ పెళ్లి కాలేదు కానీ ఆల్మోస్ట్ పెళ్లయిన వాళ్లు చేసే పనులన్నీ వీళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.. ప్రస్తుతం వీరికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.