ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ తదితర హీరోలు సైతం సినిమాలు రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన 2023 న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.దీంతో కొన్నిచోట్ల అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి.
సింహాద్రి సినిమాను ప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.అది పెద్ద స్క్రీన్ ఉన్న ఐమాక్స్ మెల్ బోర్న్ లో స్కిన్నింగ్ చేయబోతున్నారు అక్కడ కేవలం హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఆ స్థాయిలో సినిమాలు విడుదలవుతూ ఉంటాయని తెలుస్తోంది. ఒక పాత సినిమాను అది కూడా ఒక ప్రాంతీయ భాష సినిమా అయినటువంటి సింహాద్రి సినిమాని స్క్రీనింగ్ చేయడమంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం తెలిసిన అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ రేంజ్ లో రిలీస్ అయ్యే సినిమాలు దక్కని ఘనత ఎన్టీఆర్ సినిమాకు దక్కడంతో నేటిజన్స్ అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ ఆడియోతో 4K క్వాలిటీతో విడుదల చేయబోతున్నారు. మెల్ బోర్న్ బుకింగ్ కు సంబంధించి ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్గా భూమిక అంకిత నటించారు.ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. కీరవాణి సంగీతాన్ని అందించడం జరిగింది.