జబర్దస్త్ యాంకర్ అనసూయ జబర్దస్త్ తో వచ్చిన క్రేజుతో ఎన్నో సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన అనసూయ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించి మెప్పించింది. అయితే గతంలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సినిమాలలో యాక్టింగ్ కోసమే అనసూయ జబర్దస్త్ కూడా గుడ్ బై చెప్పిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నవల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ఈ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు అయితే వినిపించాయి తప్ప ఎక్కడ కూడా ఈ సిరీస్ అనౌన్స్మెంట్ చేయలేదు. అనసూయ కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి కానీ రెగ్యులర్గా వచ్చి జబర్దస్త్ పేమెంట్ ని వదిలేసి మరి క్రిష్ వెబ్ సిరీస్ కు ఒకే చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి.
బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు సంపాదించిన అనసూయ ఈ వెబ్ సిరీస్ లో వేసే పాత్రలో నటిస్తుందని ప్రేక్షకులకు తెలియగానే ఈ వెబ్ సిరీస్ పైన మరింత ఆసక్తి నెలకొంది
అయితే డైరెక్టర్ క్రిష్ ఈ వెబ్ సిరీస్ ని మొదలు పెట్టాలి అంటే క్రిష్ పవన్ నటిస్తున్న వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయవలసి ఉంది ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనే లేదు కేవలం ఈ సినిమా షూటింగ్ మీద బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే అనసూయతో వెబ్ సిరీస్ పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి అనసూయ కన్యాశుల్కం వెబ్ సిరీస్ పై ఆడియన్స్ లు ఎలాంటి బజ్ ఏర్పడుతుందో చూడాలి మరి. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 లో మాత్రమే నటిస్తోంది.